Saturday, May 17, 2025
spot_img
HomeTELANGANAరక్తశుద్ది కేంద్రంలో రోగులకు వెంటనే జనరేటర్ సౌకర్యం కల్పించాలి

రక్తశుద్ది కేంద్రంలో రోగులకు వెంటనే జనరేటర్ సౌకర్యం కల్పించాలి

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గల రక్తశుద్ది కేంద్రాన్ని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల కార్తిక్ సందర్శించారు. జిల్లా కేంద్రంలో గల డయాలసిస్ రోగులకు అందుతున్న సేవలను పరిశీలించేందుకు రక్తశుద్ది కేంద్రానికి వెళ్ళిన వారికి రక్తశుద్ది కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రక్త శుద్ది కేంద్రంలో నిత్యం సుమారుగా 20 మంది రోగులు రక్త శుద్ది చికిత్స పొందుతున్నారని అసలే వేసవి కాలం తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు జనరేటర్ సహకారంతో చికిత్స అందించాల్సి ఉంటుంది కానీ ఈ ఆసుపత్రిలో అధికారుల సమన్వయ లోపం వలన జనరేటర్ కు డీజిల్ ఇవ్వలేకపొతున్నారని దీని వలన రక్త శుద్ది చేయడానికి వచ్చిన రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. అసలే పేద రోగులు ఆ పై డీజిల్ స్వంతంగా తెచ్చుకొని చికిత్స చేసుకొనే స్థోమత ఉండదు జిల్లా ఆసుపత్రికి కోట్ల రూపాయల నిధులు వచ్చి ఉన్న కూడా కనీసం రక్తశుద్ది కేంద్రంలోని రోగుల చికిత్సకు అంతరాయం కలగకుండా జనరేటర్ కోసం డీజిల్ ఇవ్వకపోవడం సరైంది కాదని వెంటనే సంబంధిత ఆసుపత్రి అధికారులు డీజిల్ ఎర్పాటు చేయాలని కోరుతున్నాము లేనట్లయితే భవిషత్తు పోరాటాలు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments