యాసంగి సీజన్ వరి పంటలు కోతకు వస్తున్న దృష్ట్యా ప్రతి ఏటా మాదిరిగా ఎల్లారెడ్డిపేట కు సాగు నీటిని అందించే సింగ సముద్రం వద్ద గల మైసమ్మకు మొక్కులు చెల్లించుకోవాలని స్థానిక సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో రైతులు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. మైసమ్మ పండగ నిర్వహణకు ప్రతి ఎకరాన రెండు వందల రూపాయలు పోగు చేసుకుని మైసమ్మ పండగ ఈ నెల చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో చేయాలని నిర్ణయించినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కమిటీ మాజీ చైర్మన్ మేగి నర్సయ్య పాల్గొన్నారు.