Saturday, May 17, 2025
spot_img
HomeANDHRA PRADESHపది ఫలితాల్లో శ్రీ భారతి విద్యానికేతన్ హవా: కరెస్పాండంట్ సుంకర వీరబాబు

పది ఫలితాల్లో శ్రీ భారతి విద్యానికేతన్ హవా: కరెస్పాండంట్ సుంకర వీరబాబు

పదవ తరగతి ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం ప్రధమ,తృతీయ స్థానాల్లో నిలిచి ఒమ్మంగి శ్రీ భారతి విద్యానికేతన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కరస్పాండెంట్ సుంకర వీరబాబు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్ని, వారి తల్లి తల్లిదండ్రులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలని తీర్చిదిద్దిన అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భారతి విద్యానికేతన్ నుండి 69 మంది పరీక్షలకి హాజరు కాగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. పల్లాటి లాస్య మానస్విని 600 మార్కులకు గాను 588 మార్కులు, గొర్ల దుర్గ వైష్ణవి 583 మార్కులు సాధించి మండలంలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని తెలియచేసారు. 550 మార్కులు పైబడి 10 మంది, 500 మార్కులు పైబడి 35 మంది విద్యార్థులు సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు సాధించడానికి శ్రీ భారతి విద్యానికేతన్ కృషి చేస్తుందన్నారు. అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను శ్రీ భారతి విద్యానికేతన్ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామిశెట్టి బుల్లిరామన్న,ఏవోలు సుంకర గంగబాబు, సూరిశెట్టి సత్యనారాయణ, చెవల రాము, రామకుర్తి నాగ చిన్నా,పెట్టుం మూర్తి, ఇందుకూరి అనురాధ, గాధం నీలవేణి, కంటా అనంత, వల్లు దుర్గాభవానీలతో పాటు పలువురు విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments