గత నెల 8 నుండి 11 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ లలో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) పాల్గొని హైమర్ త్రోలో తన ప్రతిభను కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం అందుకోగా బుధవారం కరీంనగర్ అలుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ (సిఓఈ) ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు వీరేశంలు ఆత్మీయంగా ఆహ్వానించి చిన్ననాటి శిష్యుడు ప్రభాకర్ (ప్రభు) మెడలో మెడల్స్ ను వేసి ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి ఫిజికల్ డైరెక్టర్ వీరేశంలో మాట్లాడుతూ ప్రభాకర్ ఐదో తరగతి నుండి మడిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదివి నాటినుండి నేటివరకు చదువుతోపాటు క్రీడలు, కళల రంగాలలో తనదైన ప్రతిభను కనబరుస్తూ క్రమశిక్షణతో ఈ సమాజానికి ఆదర్శంగా నిలవడం గురుకుల గురువుగా గర్వపడుతున్నామని అన్నారు. ప్రభాకర్ ఉన్న మంచి పనులను యువకులు కాకుండా ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని పుట్టిన ఊరికి ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. తైవాన్ దేశంలో జరిగే అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని విజయం సాధించాలని అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.