Sunday, March 23, 2025
spot_img
HomeTELANGANAఅవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత

వేములవాడలో మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు ఆదేశాలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ, క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడుతూ వారికి ఇబ్బందులు ఉంటే సిబ్బందితో మాట్లాడుతూ సులభంగా దర్శనం అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. జాతరకు తరలివచ్చే వందలాది వాహనాల వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. శివరాత్రి జాతర సందర్భంగా దేవాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సుమారు 200 సీసీ కెమెరాలు మరియు పట్టణ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తూ అవాంతరాలు జరిగిన ప్రదేశాలలో ట్రాఫిక్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి కమ్యూనికేషన్ సెట్ ద్వారా సూచనలు చేస్తూ ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments