Tuesday, February 11, 2025
spot_img
HomeCINEMAకొత్త హంగులతో ‘ఖుషి

కొత్త హంగులతో ‘ఖుషి

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఒకప్పుడు భారీ విజయాన్ని నమోదు చేసుకుని ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన చిత్రాలను మేకర్స్‌ ఇప్పుడు డిజిటలైజ్‌ చేసి కొత్త హంగులతో 4కె రిజల్యూషన్‌లో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యన అలా విడుదలైన ప్రతి చిత్రం రీరిలీజ్‌లోనూ సత్తా చాటాయి. డిసెంబర్‌ 31న ‘ఖుషి’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు నిర్మాత ఎ.ఎంరత్నం. పవన్‌కల్యాణ్‌ భూమిక జంటగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 20 ఏళ్ల క్రితం ఓ సంచలనం. అప్పట్లో ఈ చిత్రంలో పవన్‌ నటన, యాటిట్యూడ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్‌ తగ్గిందేలే! డిసెంబర్‌ 31న ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధించిన వార్తలే. ప్రస్తుతం భూమిక అమెరికాలో ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రాన్ని భూమిక ప్రేక్షకులు, అభిమానులతో వీక్షించారు. అభిమానులతో సందడి చేశారు. వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింద హల్‌చల్‌ చేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments